ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్వాడీలు, మున్సిపల్, సమగ్రశిక్షా ఉద్యోగులకు మద్దతుగా మంగళవారం అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యాన జైల్భరో నిర్వహించను న్నాయి. దీనిలో భాగంగా ఉదయం పది గంటలకు అలంకార్ సెంటర్లోని ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సమ్మెలు సాగుతున్నా.. స్పందించని ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టనున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమాలు జరుగుతాయని నాయకులు ప్రకటించారు.