ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి : బాలకృష్ణ

 

ప్రజాశక్తి-హిందూపురం : వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి  బాలకృష్ణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో గురువారం జరిగిన టీడీపీ – జనసేన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. రాష్ట్రంలో పరిపాలన మొత్తం నేరస్తులు, హంతకుల చేతిలో ఉందన్నారు. ప్రజాస్వామ్య సంరక్షణ అందరూ కలిసి పోరాటం చేయాలని కోరారు. పరిపాలన ఇష్టరాజ్యంగా సాగుతుందన్నారు. పరిపాలన చేతకాక మూడు రాజధానులు అంటూ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహించారు.  రాష్ట్రానికి ఒక పరిశ్రమ రాలేదు అని ఆరోపించారు. ఆరోగ్య ఆస్పుత్రులకు బకాయి పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని తెలిపారు. గడపగడపలో పార్టీలకు అతీతకంగా ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని తెలిపారు. 

➡️