ఫైర్‌ సర్వీసెస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ కార్యాలయం ప్రారంభించిన సీఎం

తెలంగాణ : ఫైర్‌ సేఫ్టీ డిపార్ట్‌ మెంట్‌ లో కమాండ్‌ కంట్రోల్‌ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. అగ్నిమాపక విభాగం యొక్క అత్యాధునిక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రధాన కార్యాలయాన్ని ఆదివారం సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. ఫైర్‌ డిపార్ట్‌ మెంట్‌ అనేది కేవలం అగ్ని ప్రమాదాలు కోసమే కాదు, విపత్తకర పరిస్థితుల్లో కూడా వీరు సేవలు అందిస్తూ ఉంటారని తెలిపారు. ప్రాణాలు తెగించి అందరి ప్రాణాలు కాపాడడంలో ఫైర్‌ డిపార్ట్‌ మెంట్‌ కీలకమన్నారు. ఎన్నో వేలాది నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ఫైర్‌ డిపార్ట్‌ మెంట్‌ కి భవనం లేకపోవడం మంచిది కాదన్నారు. ఏ నగరంలో శాంతి భద్రతలు ఉంటాయో ఆ నగరం అభివఅది చెందుతుందన్నారు. గత ముప్పై ఏళ్లుగా హైదరాబాద్‌ నగరం అభివృద్ధిలో చంద్రబాబు, వైఎస్‌ ఆర్‌, కేసీఆర్‌ ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. హైదరాబాద్‌ కు ముందుగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు ను చంద్రబాబు ప్రతిపాదన చేశారని, దాన్ని కొనసాగిస్తూ వైఎస్‌ ఆర్‌ పూర్తి చేశారని తెలిపారు. రీజనల్‌ రింగ్‌ రోడ్డు ను త్వరలో తీసుకోస్తామన్నారు. రింగ్‌ రోడ్డు చుట్టూ ట్రైన్‌ సదుపాయం కూడా తీసుకు రాబోతున్నామన్నారు.అంతర్జాతీయ ఎయిర్‌ పోర్ట్‌ పక్కన ప్రమాద డ్రగ్‌ తయారీ కంపనీ ఏర్పాటు సరైనది కాదన్నారు. ఫార్మ్‌ సిటీలో మీరు ప్లాన్‌ చేస్తే మేము పల్లె లో ప్లాన్‌ చేస్తున్నామని, 10 నుండి 15 విలేజ్‌ లో ఫార్మ్‌ ను ప్లాన్‌ చేస్తున్నామన్నారు. ఒకే ప్రాంతము 25 వేల ఎకరాల్లో ఫార్మ తీసుకొస్తే నగరం అంత కలుషితం అవుతుందని, అపోహాలకు ఎవరు లోను కాకండని సూచించారు. అవగాహన లేకుండా అనుమతులు ఇస్తూ సంతకాలు పెడితే మాజీ హెచ్‌ఎమ్‌డిఎ డైరెక్టర్‌ బాలకృష్ణ పరిస్థితి వస్తాదన్నారు.ఈ కార్యక్రమానికి పట్నం మహెందార్‌ రెడ్డి, తెలంగాణ ఫైర్‌ శాఖ డిజి నాగిరెడ్డి, హౌం ప్రనిస్పల్‌ సెక్రెటరీ జితేందర్‌, సౌమ్య మిశ్రా ఇతరఅధికారులు, ఫైర్‌ సిబ్బంది పాల్గన్నారు.

➡️