బిఆర్‌ఎస్‌ కమీషన్ల కోసం రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టింది: మంత్రి ఉత్తమ్‌

Mar 1,2024 15:30 #minister uttam, #press meet

హైదరాబాద్‌: మేడిగడ్డ విషయంలో బిఆర్‌ఎస్‌ తీరు హాస్యాస్పదమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై సత్వర విచారణ జరగాలి. ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం భారీ తప్పులు చేసింది. కమీషన్ల కోసం రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టింది. కొన్ని రిపోర్టులను ప్రభుత్వం ఇవ్వలేదని ఎన్డీఎస్‌ఏ పేర్కొంది. విజిలెన్స్‌ నివేదికపై న్యాయసలహా తీసుకుని కేసులు నమోదు చేస్తాం’ అని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

➡️