బీసీలు అంటేనే భరోసా.. బాధ్యత.. భవిష్యత్తు : లోకేశ్‌

Mar 6,2024 08:10 #Nara Lokesh, #speech

మంగళగిరి: బీసీలు అంటేనే భరోసా.. బాధ్యత.. భవిష్యత్తు అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ‘జయహో బీసీ’ సభలో ఆయన పాల్గొనని ప్రసంగించారు. బీసీలంటే బలహీనవర్గాలు కాదని.. బలమైన వర్గాలుగా మార్చింది ఎన్టీఆర్‌ అని గుర్తు చేశారు. చంద్రబాబు వచ్చాక బీసీలను మరింత ప్రోత్సహించారని చెప్పారు. ఇప్పుడు వారిలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామన్నారు.

”టిడిపి హయాంలో బీసీ సాధికార కమిటీలు ఏర్పాటు చేశాం. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. ఆదరణ పథకానికి రూ. వెయ్యి కోట్లు కేటాయించాం. వారికోసం కేంద్రంలో ప్రత్యేక శాఖ ఉండాలని టిడిపినే తీర్మానం చేసింది. జగన్‌ వచ్చాక స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించారు. బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.75వేల కోట్లు పక్కదారి పట్టించారు. బీసీలంటే అతనికి చిన్నచూపు.. వారికి అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వరు. బీసీలకు రాష్ట్రంలో, దేశంలో అనేక పదువులు ఇచ్చిన ఘనత టిడిపిదే. వారి పట్ల టిడిపికు చిత్తశుద్ధి ఉంది. మంగళగిరిలో నేను ఓడినా.. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా”అని వివరించారు.

➡️