విశాఖపట్నం: వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ రాజీనామా చేశారు. విశాఖ దక్షిణలో జరుగుతున్న పరిణామాలతో రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ఈమేరకు సీఎం జగన్కు లేఖ పంపారు. జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సుధాకర్ రాజీనామా చేయడం పార్టీలో ప్రకంపనలు రేపుతోంది.