హైదరాబాద్ : సైబర్ నేరాల కట్టడికి సైబర్ క్రైమ్ బ్యూరో ఎంతో కఅషి చేస్తున్నదని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చాలా సైబర్ నేరాలు నమోదు అవుతున్నాయన్నారు.సైబర్ నేరాల్లో రికవరీ అనేది బాధితుల ఫిర్యాదు చేసే సమయాన్ని బట్టి ఉంటుందని తెలిపారు. ఎక్కుగా ఉన్నత చదువులు చదివన వారు, మధ్య తరగతి వారే నేరాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. నేరాలు జరిగినప్పుడు స్పందించడం కంటే ముందుగానే అవగాహన కల్పించడం చాలా ముఖ్యమన్నారు.