ప్రజాశక్తి – వీరులపాడు (కృష్ణా జిల్లా) : ఎన్టిఆర్ జిల్లా వీరులపాడు మండలం సీలేరులో పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు.. సీలేరుకు చెందిన సురేష్ అనే వ్యక్తి నుంచి హన్మకొండ జిల్లా శాయంపేటకు చెందిన అబ్దుల్ రహీ, మధ్యప్రదేశ్కు చెందిన మరోవ్యక్తి కొనుగోలు చేశారు. గంజాయిని వారికి ఇచ్చేందుకు చింతపండు, యూరియా బస్తాల మాటున బస్సులో హన్మకొండకు సురేష్ తీసుకొచ్చారు. బస్సులోని వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో వారి తనిఖీలు చేసి 9.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెటులో దీని విలువ రూ.2.35 లక్షల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. సురేష్ను అదుపులోకి తీసుకున్నారు.