కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ .. ఆరోగ్యశ్రీ పై కీలక నిర్ణయం

తెలంగాణ : తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన వేళ … రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య శ్రీ విషయమై కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం కోసం ఖర్చును రూ.10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది నేటి నుంచి అమలులోకి రానున్నట్టు ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యానికి రూ.10 లక్షలకు తెలంగాణ ప్రభుత్వం పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఇది నేటి నుంచి అమలుకానుంది. రాష్ట్రంలో 77 లక్షల 19 వేల మందికి ఆరోగ్యశ్రీ కార్డులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,310 ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలను అందించనున్నారు. 293 ప్రైవేట్‌ ఆస్పత్రులు, 198 ప్రభుత్వ ఆసుపత్రులు, 809 పీహెచ్‌సీలలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్య శ్రీ కింద 1,376 శస్త్రచికిత్సలు, 289 వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి.

➡️