రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

Jan 18,2024 15:10 #hyderabad, #road accident

హైదరాబాద్‌: భరత్‌ నగర్‌ ఫ్లై ఓవర్‌ పై వాటర్‌ ట్యాంక్‌ డీ కొట్టడంతో స్కూటీపై వెళ్తున్న ఓ యువతి కింద పడిపోయింది. ఆ సమయంలో ఆర్టీసీ బస్సు ఆమె నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి పేరు సునీతగా పోలీసులు దృవీకరించారు. అమె హైదరాబాద్‌ లో ప్రయివేట్‌ కంపెనీలో జాబ్‌ చేస్తోంది. గురువారం ఉదయం కూకట్‌ పల్లి నుంచి ఎర్రగడ్డ వైపు వెళ్తుండగా.. ఓ వాటర్‌ ట్యాంక్‌ దూసుకొచ్చింది. వెనుక నుంచి ఆమె వెళ్తున్న స్కూటీని ఢ కొట్టింది. దీంతో ఆమె కిందపడిపోయింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు చక్రాల కింద నలిగి అక్కడిక్కడే ఆమె మృతి చెందింది. యాక్సిడెంట్‌ను చూసేందుకు అటుగా వెళ్లే వాహనదారులు ఆగిపోవడంతో.. ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

➡️