మంత్రి ధర్మాన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసిన అచ్చెన్నాయుడు

Feb 22,2024 17:45 #Achchennaidu, #TDP

ప్రజాశక్తి-అమరావతి : అవసరమైతే వాలంటీర్లు ఎన్నికల సమయంలో పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లుగా కూర్చోవాల్సి ఉంటుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు కేంద్ర ఎన్నికల సంఘం దష్టికి తీసుకెళ్లారు. సాక్ష్యాధారాలతో ఈసీకి ఫిర్యాదు చేశారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో ఉండరాదన్న ఆదేశాలను మంత్రి ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. 80 ఏళ్లకు పైబడిన వద్ధులకు, దివ్యాంగులకు ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఇస్తున్నారని, వాళ్లతో ఓటేయించే విషయంలో వాలంటీర్లు కీలకపాత్ర పోషించాలని ధర్మాన ప్రసాదరావు నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. వాలంటీర్లకు సర్వీస్‌ రూల్స్‌ ఏవీ లేవని, వారు బూత్‌ ఏజెంట్లుగా ఉండేందుకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవని అన్నారు. ఎవరికి ఓటు వేయాలో చెప్పాల్సింది మీరే కదా అంటూ వాలంటీర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

➡️