విప్‌లుగా నియమించండి

  • ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్‌ లేఖ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : జనసేనకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను అసెంబ్లీలో విప్‌లుగా నియమించాలని కోరుతూ ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సోమవారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. లేఖను ఆయన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్‌ మీడియాకు విడుదల చేశారు. జనసేనకు చెందిన నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌, రైల్వే కోడూరుకు చెందిన అవర శ్రీధర్‌ను ఆయన సిఫార్సు చేశారు.

చార్టర్డ్‌ అకౌంటెంట్లకు అభినందనలు
చార్టర్డ్‌ అకౌంటెంట్లకు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. వ్యాపారాల్లోనూ, అంచనాల్లోనూ వారెంతో కీలకమని తెలిపారు. వారి సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు.

➡️