- సిఎస్కు సమగ్రశిక్షా ఎంప్లాయీస్ ఫెడరేషన్ లేఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమగ్ర శిక్షాలో పనిచేస్తున్న అన్ని కేడర్ల ఉద్యోగులకూ ఏప్రిల్ జీతాల బడ్జెట్ను జిల్లాలకూ వెంటనే విడుదల చేయాలని ఎపి సమగ్రశిక్షా కాంట్రాక్టు అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్రెడ్డికి ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, అధ్యక్షులు బి కాంతారావు సోమవారం లేఖ రాశారు. సమగ్ర శిక్షాలోని ఉద్యోగులు చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ జీతాలు కూడా సకాలంలో రాకపోవడంతో ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఏప్రిల్ జీతాల బడ్జెట్ను వెంటనే జిల్లాలకు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించేలా ముందస్తు బడ్జెట్ కేటాయింపు చేయాలని కోరారు.