నాలుగో రోజుకు చేరుకున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర

Mar 30,2024 10:41 #anathapuram, #ap cm jagan, #tour

ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల్లో మరోసారి విజయమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 4వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాల్లో కొనసాగిన యాత్ర… ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తోంది. నిన్న రాత్రి కర్నూలు జిల్లా పత్తికొండలోని కేజీఎన్‌ ఫంక్షన్‌ హాలు వద్ద జగన్‌ బస చేశారు. ఈనాటి యాత్ర పత్తికొండ నుంచి ప్రారంభమవుతుంది. రతన మీదుగా తుగ్గలి, గజరాంపల్లి, జొన్నగిరి, గుత్తి, పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్‌, రాప్తాడు, ఆకుతోటపల్లి, కృష్ణంరెడ్డిపల్లి వద్ద ముగింపు మధ్యలో తుగ్గలిలో సీఎం జగన్‌ పబ్లిక్‌ ఇంటెరాక్షన్‌ ఉంటుంది. రాత్రి ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని సంజీవపురంలో జగన్‌ బస చేస్తారు.

➡️