అమరావతి : అధికారంలోకి రాగానే ఎపి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తానని టిడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. శుక్రవారం చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. స్థిరాస్తితో మనిషికే ఉండే అనుబంధం… భూమికి చెట్టుకు ఉన్నంత అని అన్నారు. ఆస్తుల దోపిడీయే గానీ.. తరాల మధ్య ప్రేమలను జగన్ పట్టించుకోరు అని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి కాబట్టే చెల్లెళ్లను దూరంగా పెట్టారని విమర్శించారు. ఎపి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైనదన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత తనది అని చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.