హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి భారీ విరాళం ప్రకటించారు. రూ.5 కోట్ల చెక్ను ఇవాళ జనసేనాని పవన్ కల్యాణ్కు అందజేశారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షుటింగ్ హైదరాబాద్ శివారు ప్రాంతం ముచ్చింతల్లో జరుగుతుండగా… పవన్ కల్యాణ్, నాగబాబు షుటింగ్ లొకేషన్కు వెళ్లారు. తన తమ్ముళ్లకు చిరంజీవి ప్రేమపూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంగానే జనసేన పార్టీకి ఆశీస్సులు అందిస్తూ.. రూ.5 కోట్ల విరాళం తాలూకు చెక్ను పవన్కు అందజేశారు.