నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు

అమరావతి: ఏపీ వ్యాప్తంగా 46.45 లక్షల హెక్టార్లలో ఖరీఫ్‌ సాగవుతోందని.. పంటల సాగులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఖరీఫ్‌ సీజన్‌ కార్యాచరణపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ”నకిలీ విత్తనాలకు చెక్‌పెట్టాలి. అనుమతి లేని రకాలు, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి. రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ద్వారా ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. ప్రకృతి వ్యవసాయం, బిందు సేద్యం ప్రోత్సహించి సాగు విస్తీర్ణం పెంచాలి” అని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

➡️