ప్రజాశక్తి-అమరావతి : ఏపీ సీఎం జగన్ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలో రేపు సాయంత్రం జరిగే ఆడుదాం ఆంధ్రా క్రీడల ముగింపు వేడుకల్లో పాల్గొని, విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. సీఎం జగన్ రేపు సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ పోటీల ఫైనల్ మ్యాచ్ను వీక్షించనున్నారు. అనంతరం, ఆడుదాం ఆంధ్రా క్రీడోత్సవాల్లో పాల్గొన్న క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బహుమతుల ప్రదానం అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.
![cm jagan meet kcr](https://prajasakti.com/wp-content/uploads/2024/01/cm-jagan-meet-kcr.jpg)