ఇళ్ల వద్దకే పింఛను – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో సామాజిక పెన్షన్‌లను మే ఒకటిన ఇళ్ల వద్దనే పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా వున్నాయని పేర్కొన్నారు. ఏప్రిల్‌ నెలలో సచివాలయాల వద్ద పంపిణీ చేయడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. చాలా మంది వృద్ధులు అస్వస్థతకు గురిగాక, కొంతమంది మృతిచెందారని పేర్కొన్నారు. సిబ్బంది కొరత, నగదు లేదనే కారణాలతో ఆలస్యం చేయకుండా, ఒకటో తేదీనే సచివాలయ, రెవెన్యూ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేయించాలని కోరారు.

➡️