తుపాను సహాయక చర్యలు చేపట్టాలి: సిపిఎం రాష్ట్ర కమిటీ

Dec 4,2023 21:09 #CPM AP

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వరి కోతల సమయంలో తుపాను ముంచుకురావడంతో కోస్తా జిల్లాల ప్రజానీకం, రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోందని, తక్షణం రాష్ట్ర ప్రభుత్వం అన్ని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. తుపాను వల్ల రైతులకు, ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని, బాధిత ప్రజలను ఆదుకోవాలని కోరింది. అలాగే పార్టీ కార్యకర్తలు, వలంటీర్లు ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలబడి అవసరమైన సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో కోరారు.

➡️