నాంపల్లి (తెలంగాణ) : హైదరాబాద్ నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్పైకి చేరుకునే క్రమంలో.. రైలు ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. పట్టాలు తప్పి ప్లాట్ఫాం సైడ్వాల్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని లాలాగూడ రైల్వే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో సుమారు 50 మందికి గాయాలయ్యాయి. కొంతమందికి గుండెపోటు రావడంతో లాలాగూడ రైల్వే ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురికావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా కేకలువేస్తూ ప్రయాణికులు రైలు నుంచి కిందకు దిగే ప్రయత్నం చేశారు.