బిఎస్‌ఎన్‌ఎల్‌ పెన్షనర్ల ధర్నా

Jul 2,2024 20:51 #BSNL, #BSNL pensioners, #Dharna

ప్రజాశక్తి – కడప అర్బన్‌ (వైఎస్‌ఆర్‌ జిల్లా) : తమ సమస్యలు పరిష్కరించాలని వైఎస్‌ఆర్‌ జిల్లా బిఎస్‌ఎన్‌ఎల్‌ జనరల్‌ మేనేజర్‌ కార్యాలయం ఎదుట కేంద్ర ప్రభుత్వం బిఎస్‌ఎన్‌ఎల్‌ పెన్షనర్లు మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా జాయింట్‌ ఫోరం బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంటిఎన్‌ఎల్‌ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సి సుబ్బారెడ్డి, కల్యా సుధాకర్‌ మాట్లాడుతూ పెన్షన్‌ రివిజన్‌ 2017, జనవరి ఒకటి నుంచి 15 శాతం పెంపుతో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పెన్షనర్లకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జనరల్‌ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం ఎస్‌. భాస్కర్‌, బద్వేల్‌ ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాజంపేట బ్రాంచుల కార్యదర్శులు బిసి బాలయ్య, పి వెంకటసుబ్బయ్య, వి హనుమంతరావు, సంగీతరావు, రెడ్డయ్య, మహిళా సభ్యులు కోనె విజయలక్ష్మి, జయమ్మ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

➡️