మత్స్యకారుల జీవన భృతి కోసం రేపట్నుంచి ఎన్యుమరేషన్‌

May 1,2024 00:50 #Fisheries Association

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు జీవనభృతి కోసం గురువారం నుంచి ఎన్యుమరేషన్‌ ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర మత్స్యశాఖ కమిషనరు సూర్యకుమారి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సముద్ర జలాల్లో 61 రోజులపాటు చేపల వేట నిషేధించిందని, మత్స్యకారుల జీవనోపాధి కోల్పోతున్న కారణంగా ప్రతి సంవత్సరం చెల్లిస్తున్న విధంగానే ఈ ఏడాదీ జీవనభృతిని చెల్లిస్తామన్నారు. జీవనభృతి చెల్లించేందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతి తీసుకున్నామన్నారు. ఎన్యుమరేషన్‌కు మత్స్యకారులందరూ సహకరించాలని కోరారు.

➡️