ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : వ్యక్తిగత పర్యటనపై బెంగళూరుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తాడేపల్లికి చేరుకున్నారు. బెంగళూరు నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జగన్మోహన్రెడ్డికి మాజీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, కొట్టు సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎంపి విజయసాయిరెడ్డి, మాజీ ఎంపి నందిగం సురేష్, వైసిపి నాయకులు దేవినేని అవినాష్, తదితరులు ఘనస్వాగతం పలికారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశాక స్పీకర్ ఎన్నికల్లో కూడా పాల్గొనకుండా మూడు రోజుల పులివెందుల నియోజకవర్గ పర్యటనకు వెళ్లారు. అక్కడ నుండి బెంగుళూరుకు వెళ్లి తిరిగి తాడేపల్లికి చేరుకున్న తమ నాయకుడికి వైసిపి శ్రేణులు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/ys.jagan_.jpg)