హైదరాబాద్ : తెలంగాణ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆసుపత్రిలో చేరారు. ఎర్రవెల్లి ఫామ్హౌస్లో పంచె తగిలి కాలుజారి పడటంతో కెసిఆర్ కు తీవ్ర గాయమైనట్లు సమాచారం. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో అయనను చేర్చారు. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స నిర్వహించాల్సి రావొచ్చని భావిస్తున్నారు. అయితే వైద్య పరీక్షలు పూర్తయ్యాక శస్త్రచికిత్సపై డాక్టర్లు నిర్ణయం తీసుకోనున్నారు.