హైదరాబాద్: సోమవారం సాయంత్రం సీఎం రేవంత్రెడ్డిని కలిసిన అనంతరం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఛైర్మన్ పదవికి జనార్దన్రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనార్దన్రెడ్డి రాజీనామాను ఆమోదించినట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో రాజ్భవన్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు రాజ్భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ”జనార్దన్రెడ్డి రాజీనామాను గవర్నర్ తమిళిసై ఆమోదించలేదు. ఆయన రాజీనామా ఆమోదం పొందినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం.. గవర్నర్ ప్రస్తుతం పుదుచ్చేరి పర్యటనలో ఉన్నారు.” అని రాజ్భవన్ క్లారిటీ ఇచ్చింది.