సిఎం జగన్‌పై దాడి కేసులో తీర్పు రిజర్వు

ప్రజాశక్తి – విజయవాడ : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి కేసు సోమవారం కోర్టులో విచారణకు వచ్చింది. నిందితుడు సతీశ్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. 8వ అదనపు జిల్లా న్యాయస్థానంలో నిందితుడి తరఫు న్యాయవాది సలీం వాదనలు వినిపించారు. సతీశ్‌ను పోలీసులు అక్రమంగా ఈ కేసులో ఇరికించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం తీర్పును న్యాయమూర్తి రిజర్వు చేశారు. దీనిపై మంగళవారం ఉత్తర్వులు వెల్లడించే అవకాశముంది.

➡️