- సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు జులై పదో తేదీన జరగనున్న డిమాండ్స్ డేను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు కోరారు. సోమవారం విజయవాడ బాలోత్సవ భవన్లో కె నాగభూషణం అధ్యక్షతన జరిగిన మున్సిపల్ కార్మికుల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ తీరును ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు. మున్సిపల్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు కూడా మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు సోమయ్య, బలరామ్, వెంకటరావు, ముత్యాలరావు, నరసయ్య, జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు.