సిఎం అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదనపు కార్యదర్శిగా 2009 ఐఎఎస్‌ బ్యాచ్‌కు చెందిన కార్తికేయ మిశ్రా నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టరుగా ఉన్న ఆయనను ఎపి సర్వీసుకు పంపాలని కేంద్రానికి సిఎం ఇటీవల లేఖ రాశారు. స్పందించిన డిఒపిటి.. కార్తికేయ మిశ్రాను ఎపి కేడర్‌కు పంపుతూ నిర్ణయం తీసుకుంది.

➡️