Accident: పూణెలో కారు ప్రమాదం – ఐదుగురు మృతి

Jul 3,2024 08:01 #Deaths, #Maharashtra, #road accident

పూణె : పూణె-షోలాపూర్ జాతీయ రహదారిపై వాహనం బోల్తా పడి ఐదుగురు మృతి చెందగా.. ఒకరు గాయపడ్డారు. మహారాష్ట్రలోని పూణె నగర శివారులో ఈ ప్రమాదంలో మృతులందరూ  తెలంగాణకు చెందిన మృతులు రఫీక్ ఖురేషీ (వయస్సు 34), ఇర్ఫాన్ పటేల్ (వయస్సు 24), మెహబూబ్ ఖురేషి (వయస్సు 24), ఫిరోజ్ ఖురేషి (వయస్సు 27) వారుగా గుర్తించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువత టూరిజం కోసం మహారాష్ట్రకు వెళ్లారు. మంగళవారం భిగ్వాన్ సమీపంలో ఇంటికి తిరిగి వస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం అదుపు తప్పి కారు బోల్తా పడింది. సమీపంలో ఉన్న వారు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు. మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా 25 ఏళ్ల లోపు వారేనని పోలీసులు తెలిపారు.

➡️