భూ హక్కుల చట్టం అమలులోకి రాలేదు : హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం

land titling act andhra pradesh

 

ప్రజాశక్తి-అమరావతి : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని అమల్లోకి రాలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఆస్తి వివాదాలకు సంబంధించి దాఖలయ్యే దావాలను తిరస్కరించరాదని సివిల్‌ కోర్టులను ఆదేశించింది. కక్షిదారులు దాఖలు చేసే దావాలను విచారణ చేపట్టాల్సిందేనని కూడా తేల్చి చెప్పింది. ఈ మేరకుచీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదావేసింది. ఈలోగా ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శిలు కౌంటర్లు దాఖలు చేయాలంది. ప్రతివాదులకునోటీసులు జారీ చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని సవాల్‌ చేస్తూ ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలూ), రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ తరఫున కె.చిదంబరం, ముప్పాళ్ల సుబ్బారావు, జి.సుదర్శన్‌, కరూులు జిల్లా న్యాయవాదుల సంఘం వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. పిల్స్‌ విచారణకు రాగానే, ప్రభుత్వ ప్లీడర్‌ కల్పించుకుని, భూయాజమాన్య హక్కు చట్టానికి సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం ఖరారు చేయలేదని చెప్పారు. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాదులు గంటా రామారావు, ఎన్‌.సుబ్బారావు, న్యాయవాది యలమంజులు బాలాజీ వాదించారు. రాష్ట్ర సర్కార్‌ నూతనంగా తెచ్చిన భూ యజమాన్య హక్కుల చట్టం ప్రజల హక్కులను హరించేలా ఉందనాురు. కొత్త చట్టం అమల్లోకి రావడంతో స్థిరాస్తి వివాదాలపై దాఖలయ్యే దావాలను సివిల్‌ కోర్టులు విచారణ చేపట్టడం లేదనాురు. కొత్త చట్ట నిబంధనల ప్రకారం దావాల్లోని వివాదాలను సంబంధిత అధికారుల వద్ద తేల్చుకోవాలని సివిల్‌ కోర్టులు చెబుతున్నాయని అన్నారు. పిటిషనర్ల వాదనలను ఏజీ ఎస్‌ శ్రీరామ్‌ వ్యతిరేకించారు. భూ యాజమాన్య హక్కుల చట్టంలోని సెక్షన్‌ 4 ప్రకారం ఆయా ప్రాంతాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌కునోటిఫికేషన్‌ ఇవ్వలేదన్నారు. నోటిఫికేషన్‌ జారీకి గడువు ఉందనాురు, నిబంధనల రూపకల్పన కూడా కాలేదన్నారు.. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి (టీఆర్‌వో), ల్యాండ్‌ టైట్‌లింగ్‌ అప్పిలెట్‌ అధికారులను (ఎల్‌టీఏవో) కూడా నియమించలేదనిచెప్పారు. ఈ నేపథ్యంలో సివిల్‌ కోర్టు దావాల్ని తిరస్కరించాల్సిన అవసరం కూడా లేదన్నారు. ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకును హైకోర్టు విచారణను వచ్చే నెల 7కి వాయిదా వేసింది. అప్పటి వరకు తామిచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయని, సివిల్‌ కోర్టులు దావాలను చట్ట ప్రకారం విచారణ చేయాల్సిందేననితేల్చి చెప్పింది.

➡️