చిన్నవడ్లపూడిలో నందమూరి సుహాసిని ఎన్నికల ప్రచారం

మంగళగిరి (గుంటూరు) : మంగళగిరి మండలం చిన్నవడ్లపూడిలో నందమూరి సుహాసిని శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో నారా లోకేష్‌ కుటుంబ సభ్యులు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు. సేవ్‌ డెమోక్రసీ సేవ్‌ అమరావతి అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నందమూరి సుహాసిని మాట్లాడుతూ … ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎంతో అభివఅద్ధి జరిగిందని చెప్పారు. నేడు రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదని, వైసీపీ ప్రభుత్వం ప్రజా ఆకాంక్షలను ఏ మాత్రం నేరవేర్చలేదని విమర్శించారు. భావితరాల భవిష్యత్తు కోసం టీడీపీ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని కోరారు.

➡️