అమరావతి: రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్సభ స్థానాలకు గురువారం ఉ.11 గంటల నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది.నాల్గవ దశ ఎన్నికల్లో భాగంగా మే 13న రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీచేయనుంది. అతి కీలకమైన ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు.
పార్లమెంట్ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలో.. అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో ఎన్నికల కోడ్ను పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లు స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద సీసీ కెమేరాలను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు.
ఎన్నికల కోడ్ అమలులో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ల దాఖలు ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తామన్నారు. వీటిని ఏప్రిల్ 26 వరకు పరిశీలించి, 29 వరకు ఉపసంహరణకు సమయమిస్తారు. మే 13న పోలింగ్ కాగా.. జూన్ 4 ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
- నగరిలో గాలి భాను ప్రకాష్ నామినేషన్
నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ -జనసేన- బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ నామినేషన్ దాఖలు చేస్తారు. - అన్నమయ్య
రాజంపేటంలో అట్టహాంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్
అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అకేపాటి అమరనాథరెడ్డి
సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ సమర్పించిన అమరనాథరెడ్డి
నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు - తిరుపతిజిల్లాకిలివేటి సంజీవయ్య నామినేషన్ దాఖలు
సూళ్లూరుపేట రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయంలో మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య
హాజరైన ఎన్డీసిసిబి బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వైసీపీ నాయకుడు వేనాటి రామచంద్రారెడ్డి, కలికి మాధవరెడ్డి - ఎన్టీఆర్ జిల్లా
నామినేషన్ సమర్పించిన నల్లగట్ల స్వామిదాస్
తిరువూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన నల్లగట్ల స్వామిదాస్
కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్చార్జ్ పూనూరు గౌతమ్ రెడ్డి - తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తిలో టీడీపీ అభ్యర్ది బోజ్జల సుధీర్ రెడ్డి, నగరిలో టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్లు స్దానిక ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
- నామినేషన్ దాఖలు చేసిన కొరముట్ల శ్రీనివాసులు
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేశారు. - భర్త తరఫున నామినేషన్ దాఖలు చేసిన పయ్యావుల హేమలత
అనంతపురం జిల్లా : ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ తరపున ఒక్క సెట్ నామినేషన్ దాఖలు చేసిన పయ్యావుల కేశవ్ భార్య హేమలత. - భారీ ర్యాలీతో ఆదినారాయణ రెడ్డి నామినేషన్
కడప జిల్లా: జమ్మలమడుగు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పట్టణంలో భారీ ర్యాలీతో కదిలి వెళ్లి నామినేషన్ వేశారు. ఒక సెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు ఆదినారాయణ రెడ్డి. - తాడిపత్రిలో తండ్రి తరఫున తనయుడు నామినేషన్ దాఖలు
అనంతపురం : తాడిపత్రిలో వైసీపీ అభ్యర్థిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి తరపున ఒక్క సెట్ నామినేషన్ దాఖలు చేసిన ఆయన కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి. - రాజమండ్రి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు నామినేషన్ దాఖలు
తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసు నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీతో రాజమండ్రి మున్సిపల్ కార్యాలయానికి వచ్చి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ అందజేశారు. నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. - తూర్పుగోదావరిజిల్లా
కొవ్వూరులో ఆర్డిఓ ఆఫీస్ వద్ద 10 వేలమంది పార్టీ కార్యకర్తలు అభిమానులతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు నామినేషన్ దాఖలు చేశారు - నెల్లూరుజిల్లా
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు
కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి - కర్నూలు జిల్లా
నామినేషన్ వేసిన బుట్ట రేణుక
ఎమ్మిగనూరులో పెద్ద ఎత్తున ర్యాలీతో బయలుదేరి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి బుట్ట రేణుక
పాల్గొన్న ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య, వీరశైవ లింగాయత్ కార్పోరేషన్ చైర్మన్ రుద్ర గౌడ్ - వైఎస్ఆర్ జిల్లా
నామినేషన్ వేసిన రఘురామి రెడ్డి - మైదుకూరు తహసిల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామి రెడ్డి
పాల్గొన్న వైఎస్ అవినాష్ రెడ్డి , ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తదితరులు
భూమన అభినయ్ రెడ్డి నామినేషన్ దాఖలు - తిరుపతి నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన భూమన అభినయ్ రెడ్డి
అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి వెంట మేయర్ డాక్టర్ శిరీషా, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, స్టాండింగ్ కమిటీ సభ్యుడు వెంకటేష్ తదితరులతో కలిసి నామినేషన్ దాఖలు
నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి - అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సిపి అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి
నామినేషన్ దాఖలు చేసిన ఎం.సీ విజయనందరెడ్డి - చిత్తూరులో అటహాసంగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం సి విజయనందరెడ్డి
పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎంపీ రెడ్డప్ప, చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థి మోహిత్ రెడ్డి తదితరులు
నామినేషన్ దాఖలు చేసిన కావలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి - వైఎస్సార్సీపీ తరుఫున కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు