ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 25న విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు జులై 2 తుది గడువు కాగా, ఉపసంహరణకు అదే నెల 5 వరకు గడువు ఉంది. జులై 12న పోలింగ్, అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి. వైసిపి నుంచి టిడిపిలో చేరిన సి రామచంద్రయ్య, షేక్ ఇక్బాల్పై మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 164 సీట్లు టిడిపి, జనసేన, బిజెపి కూటమి గెలవడంతో ఈ రెండు స్థానాలు కూటమి అభ్యర్థులకు దక్కుతాయి.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/40-5.jpg)