4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు.. ఆర్బీఐకి చెందినవంటున్న అధికారులు!

పామిడి: అనంతపురం జిల్లా పామిడి వద్ద భారీగా కరెన్సీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు. 4 కంటైనర్లను తనిఖీ చేయగా.. వాటిలో రూ.500 నోట్లు తరలిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వాటి విలువ మొత్తం రూ.2వేల కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. అయితే ఆ కంటైనర్లు ఆర్బీఐకి చెందినవిగా అక్కడి అధికారులు చెబుతున్నారు. కొచ్చి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. రికార్డులను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

➡️