అమరావతి: రాష్ట్రంలో ఈనెల 7,8 తేదీల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రాజమహేంద్రవరంలో పురందేశ్వరికి మద్దతుగా 7న సాయంత్రం 3.30 గంటలకు వేమగిరిలో సభలో మోదీ ప్రసంగించనున్నారు. సాయంత్రం 5.45 గంటలకు అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గనున్నారు. 8 న సాయంత్రం 4.00 గంటలకు పీలేరు సభలో ప్రసంగించనున్నారు. రాత్రి 7.00 గంటలకు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకూ ప్రధాని మోదీ రోడ్షో నిర్వహించున్నారు.