- ముఖ్యమంత్రికి దక్షిణ మధ్య రైల్వే జిఎం విజ్ఞప్తి
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ కోరారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వేజోన్ అంశాన్ని వివరించారు. దీంతోపాటు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల స్థితిని ముఖ్యమంత్రికి వివరించారు. కేంద్ర, రాష్ట్ర సహకారాలతో జోన్ పరిధిలో ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. విశాఖలో జోన్ ఏర్పాటుకు సంబంధించి స్థలం కేటాయింపు అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. సిఎంను కలిసిన వారిలో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఎ పాటిల్, గుంటూరు డిఎం ఎం రామకృష్ణ తదితరులు ఉన్నారు.