ప్రజాశక్తి-అమరావతి : వైసిపి అభ్యర్థుల మార్పులు కొనసాగుతున్నాయి. తాజాగా 9వ జాబితాలోనూ మార్పులు చేశారు. నెల్లూరు లోక్సభకు విజయసాయిరెడ్డిని, కర్నూలు అసెంబ్లీ స్థానానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్ను, మంగళగిరికి మురుగుడు లావణ్యను నియమించినట్లు వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా మంగళగిరికి గతంలో గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించగా.. ఇప్పుడు ఆ స్థానంలో మార్పు చేసింది.