సిగరెట్టు ప్యాకెట్లలో డ్రగ్స్‌

బల్లారం పిఎస్‌ఎన్‌ మెడికేర్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌లో అధికారుల సోదాలు
ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :సంగారెడ్డి జిల్లా బల్లారం పారిశ్రామికవాడలో డ్రగ్స్‌ కలకలం రేపింది. పారిశ్రామిక వాడలోని పిఎస్‌ఎన్‌ మెడికేర్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమలో శుక్రవారం ఇంటర్‌ పోల్‌ సమాచారంతో అధికారులు దాడులు చేపట్టారు. పరిశ్రమలో డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు తొమ్మిది కోట్ల రూపాయల విలువ చేసే 90.48 కిలోల మేపిడ్రీన్‌ డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పదేళ్ల నుంచి ఈ డ్రగ్‌ను తయారు చేసి విదేశాలకు తరలిస్తున్నట్టుగా అధికారుల పరిశీలనలో తేలింది. ఈ వ్యవహారానికి సూత్రధారులైన సత్యనారాయణ రెడ్డి, సుధాకర్‌ రెడ్డి, కస్తూరి రెడ్డిని డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు అరెస్టు చేశారు. సిగరెట్టు ప్యాకెట్లలో పెట్టి విదేశాలకు డ్రగ్స్‌ను తరలిస్తున్నట్టు గుర్తించారు. ఇందులో కొంత వరకు హైదరాబాద్‌ నగరంలోనూ సప్లై అవుతున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

➡️