తెలంగాణ : మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ వేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. కెసిఆర్ తమ ముందు హాజరుకావాల్సిందిగా.. ఈ కమిషన్.. ఇప్పటికే 2 సార్లు కెసిఆర్కి నోటీసులు ఇచ్చింది. అయితే ఏకంగా ఈ కమిషన్ని రద్దు చేయాలని కోరుతూ… కెసిఆర్ హైకోర్టుకు వెళ్లారు. దీనిపై వాదోవాదాలు ముగిశాక.. ఈరోజు తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు తెలిపింది. ఆ ప్రకారమే సోమవారం తీర్పునిస్తూ … కెసిఆర్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. కెసిఆర్ ఈ అంశంపై సుప్రీం కోర్టుకు వెళతారా లేక.. కమిషన్ ముందుకు విచారణకు వస్తారా అనేది త్వరలో తెలియనుంది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/kcr.jpg)