నేడు రెండు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

Feb 8,2024 10:45 #ap assembly, #Budget Sessions
low Attendance in the assembly

ప్రజాశక్తి-అమరావతి : హొఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. 7న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఇవాళ్టితో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.. చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది.. వివిధ శాఖల చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు పెట్టనుంది ప్రభుత్వం.. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ సాగనుంది.. చర్చ అనంతరం ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన సమాధానం ఇవ్వనున్నారు.. ఇక, సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.. ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లు -2024, ఏపీ ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు -2024ను సభ ముందుకు రానున్నాయి.

➡️