రాంగోపాల్‌ వర్మ ‘వ్యూహం’పై 28కి విచారణ వాయిదా

Dec 26,2023 12:42 #RGV Movie, #telangana high court

హైదరాబాద్‌: రాంగోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమాకు ఇచ్చిన సెన్సార్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. డిసెంబర్‌ 28న విచారణ చేపడతామని తెలిపింది. సినిమా విడుదల చేయకుండా చిత్ర నిర్మాతను ఆదేశించాలని ఆ పిటిషన్‌లో కోరారు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ ప్రాంతీయ కార్యాలయం, రివైజింగ్‌ కమిటీ, రామదూత క్రియేషన్స్‌, నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌, దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మను పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు. ఈ సినిమా డిసెంబర్‌ 29న విడుదల కావాల్సి ఉంది.

➡️