తులసిరెడ్డితో వివేకా కుమార్తె, అల్లుడు భేటీ

ప్రజాశక్తి – వేంపల్లె :పిసిసి మీడియా చైర్మన్‌ తులసిరెడ్డితో శనివారం మాజీ మంత్రి వైఎస్‌.వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్‌.సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు రాజకీయ విషయాలు, వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన విషయాలను చర్చించినట్లు సమాచారం. వివేకానందరెడ్డి హత్య జరిగిన తీరుపై ఎన్నికల ప్రచార సమయంలో ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. పులివెందుల అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే విషయమై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అనంతరం కాంగ్రెస్‌ నాయకులను సునీతకు తులసిరెడ్డి పరిచయం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు ధృవకుమార్‌రెడ్డి, రాజా, బాలం సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️