ప్రజాశక్తి-రంగంపేట : తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం సుభద్రంపేటలో వృద్ధురాలుపై చేయి చేసుకున్న జడ్పిటిసి రాంబాబుపై కేసు బుక్ చేసి తక్షణం చర్య తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తారా? వైకాపా నాయకుల అరాచకాలను అదుపులో పెట్టాలని ముఖ్యమంత్రికి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.