ఎన్‌టిఆర్‌ జిల్లాలో సిఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర

Apr 13,2024 12:45 #ap cm jagan, #Bus Trip, #ntr district

విజయవాడ : వైసిపి అధ్యక్షుడు, సిఎం వైఎస్‌.జగన్‌ చేపట్టిన ‘ మేమంతా సిద్ధం ‘ బస్సు యాత్ర 14వ రోజు శనివారం ఎన్‌టిఆర్‌ జిల్లాలో కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 9 గంటలకు నంబూరు బైపాస్‌ దగ్గర నుంచి యాత్ర ప్రారంభమైంది. ముందుగా విజయవాడ సిటీలో రోడ్‌ షో ద్వారా మంగళగిరిలో సీకే కన్వెషన్‌ సెంటర్‌కి జగన్‌ చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు మంగళగిరి సీకే కన్వెన్షన్‌ సెంటర్లో చేనేత సోదరులతో ముఖ్యమంత్రి ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. అనంతరం కుంచనపల్లి బైపాస్‌ మీదుగా తాడేపల్లి బైపాస్‌కు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత విజయవాడలో వారధి, శిఖామణి సెంటర్‌, చుట్టుగుంట, భగత్‌సింగ్‌ రోడ్డు, పైపుల రోడ్డు, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్‌ మీదుగా కేసరపల్లి బైపాస్‌ శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్‌ చేరుకుంటారు.

➡️