Attack Case – టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి కేసు – వైసిపి నేతలు అరెస్టు

అమరావతి : టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి ఐదుగురు వైసిపి నేతలను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారిని మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. 2021 అక్టోబరు 19న టిడిపి కేంద్ర కార్యాలయంపై రాడ్లు, కర్రలు, రాళ్లతో వైసిపి శ్రేణులు దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి ఈరోజు వైసిపి నేతలను ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

➡️