హైదరాబాద్ : మహిళల ప్రయాణ భద్రత పర్యవేక్షణకు ఉపయోగపడే టీ-సేఫ్ యాప్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రారంభించారు. టీ-సేఫ్ ద్వారా మహిళల భద్రత, ప్రయాణ పర్యవేక్షణ సేవలను తెలంగాణ పోలీసులు పర్యవేక్షించనున్నారు. అన్ని రకాల మొబైల్ ఫోన్లకు అనుకూలంగా టీ-సేఫ్ యాప్ను రూపొందిం చారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.