ప్రజాశక్తి – తిరుమలసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు, ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్కు ఈవో ఎవి ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అధికారులు శ్రీఆరి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను, డైరీ, క్యాలెండర్, అగబత్తులు, పంచగవ్య ఉత్పత్తులను అందజేశారు.