ఢిల్లీ : శుక్రవారం మానిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్.. శనివారం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మరో జాబితాను విడుదల చేసింది. మధ్యప్రదేశ్, గోవా, డీఎన్.హవేలీ నియోజకవర్గాలకు చెందిన ఆరుగురు అభ్యర్థుల్ని కాంగ్రెస్ ప్రకటించింది. నార్త్ గోవాకు రమాకాంత్ ఖలప్, సౌత్ గోవాకు విరియాటో ఫెర్నాండెజ్, మోరెనాకు సత్యపాల్ సింగ్ సికర్వార్, గ్వాలియర్కు ప్రవీణ్ పాఠక్, ఖాండ్వాకు నరేంద్ర పాటిల్, దాదర్ డ నగర్ హవేలీకి అజిత్ రాంజీభారు మహల్ పేర్లను ప్రకటించింది.