ఫొటో : ఆనం సమక్షంలో టిడిపిలో చేరిన నాయకులు
టిడిపిలో చేరికలు
ప్రజాశక్తి-అనంతసాగరం : మండలంలోని వైసిపి నుంచి టిడిపిలోకి వలసలు కొనసాగుతున్నాయి. మండల కేంద్రం వైసిపి ఎంపిటిసి రాపూరు సుజాతమ్మ, బిజెపి మాజీ మండల అధ్యక్షులు కొమ్మి తిరుపతి నాయుడు, మెటుకూరు మనోజ్ రెడ్డి, మెట్టుకూరు జనార్దన్ రెడ్డి, చండ్ర హరిప్రసాద్ నాయుడు, 30 కుటుంబాలు టిడిపి ఎంఎల్ఎ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని పార్టీలో చేరిన వారికి ఆనం సూచించారు. కార్యక్రమంలో మండల నాయకులు ఆనం మురళిరెడ్డి, మెట్టుకూరు కృష్ణారెడ్డి, గూడూరు శ్రీకాంత్ రెడ్డి, కాకూరు నాగరాజు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.